తన క్యూట్ లుక్స్ తో కనుబొమ్మలని ఎగరేస్తూ ప్రేక్షక హృదయాలను గెలిచేసింది బేబమ్మా.. సినిమాలో ఆమె నటనకు అందరు ఫిదా అవుతారని అంటున్నారు. అయితే ఉప్పెన సినిమాకు మొదట అనుకున్న హీరోయిన్ ఈమె కాదని తెలుస్తుంది. సినిమాకు ముందు మనిషా రాజ్ ను అనుకున్నారు. ఆమెతో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగిందట. అయితే డైరక్టర్ బుచ్చి బాబు మనిషా పర్ఫార్మెన్స్ తో సంతృప్తి చెందలేదట. సినిమా చేస్తున్నా ఆ ఫీల్ రాకపోవడంతో సుకుమార్ కు చెప్పి ఆమెను తీసేయించి ఆమె ప్లేస్ లో కృతి శెట్టిని తీసుకున్నారట.
ఉప్పెన సినిమాకు కృతి శెట్టి చాలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ఆమె క్యూట్ లుక్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాయి. అందుకే కృతి సినిమా రిలీజ్ అవకుండానే పాపులర్ అయ్యింది. వరుస ఛాన్సులు వస్తున్నాయి. అయితే హీరోయిన్ ను మార్చే విషయంలో సుకుమార్ దగ్గర మొహమాట పడ్డాడట బుచ్చి బాబు అందుకు సమధానంగా నీకన్నా నాకన్నా సినిమా పెద్దది దానికి ఏం కావాలో అది ఇవ్వాలని అన్నారట. అలా ఉప్పెనలో మనిషా రాజ్ ఎగ్జిట్ అయ్యి కృతి శెట్టి వచ్చి చేరింది.