టాలీవుడ్ హాట్ హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మొదట్లో హీరోయిన్ గా నిలదొక్కుకోడానికి ఎన్నో తంటాలు పడ్డ కాజల్ రాజమౌళి "మగధీర" సినిమాతో వరుస చాన్సులు దక్కించుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్ళీ గతకొంతకాలం నుంచి క్రేజ్ పూర్తిగా తగ్గిపోవడంతో ఇక పెళ్లి చేసుకోని సెటిల్ అయిపోయింది. తన మిత్రుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.ఇక గతేడాది అక్టోబర్ లో గౌతమ్- కాజల్ ల వివాహం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కాజల్- గౌతమ్ ల వివాహం కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే.ఇక పెళ్ళైనప్పటికీ కూడా కాజల్ సినిమాల్లో నటించడానికి గౌతమ్ ఎటువంటి షరతులు పెట్టలేదట. ఆమె నటించిన 'మోసగాళ్లు' 'ముంబై సాగా' చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈమె చిరు- కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రంలో నటిస్తుంది. అది పూర్తయ్యాక నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా నటించబోతుంది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన భర్త గౌతమ్ పై అలిగిందట.


భార్యా భర్తలు అన్నాక ఇవన్నీ మామూలే కదా..! ఇంతకీ కాజల్ ఏ విషయంలో అలిగింది అంటే.. గౌతమ్ తనతో సరిగ్గా టైం స్పెండ్ చెయ్యడం లేదట. మాల్దీవ్ ల ట్రిప్ అలాగే మనాలీ ట్రిప్ తరువాత కాజల్ ను ఎక్కడికీ తీసుకువెళ్ళలేదట తన భర్త. ఇదే విషయం పై కాజల్ బుంగమూతి పెట్టుకుని ఉంటే… గౌతమ్ తన భార్యకు ఇష్టమైన చాకో బార్ చాక్లెట్ లు ఇచ్చి బుజ్జగించాడట.అయితే ఇవి ఎక్కువగా తినడం వలన ఆరోగ్యం పాడవుతుంది అని కూడా హెచ్చరించాడట. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది కాజల్. 'మా ఆయన నాకు ఇలా లంచం ఇచ్చి పాంపర్ చేస్తున్నాడు' అని అర్ధం వచ్చేలా కామెంట్ కూడా పెట్టింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: