సినీ పరిశ్రమ లో నైనా సరే, బుల్లితెరపై అయినా సరే సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే మాత్రం, ఎంతో కొంత అందంగా ఉండి తీరాల్సిందే.. ముఖ్యంగా ముఖ అందం ఎంత ఉంటుందో, అంత గుర్తింపు కూడా దక్కుతుంది. అందుకోసం నటీనటులు బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం షరా మామూలే. మరికొంతమంది వారి ముఖ అందాలను మార్చుకోవడం కోసం ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యూటీ పార్లర్ లో ఒక్కోసారి తేడా జరిగితే అందంగా కనిపించడం పక్కన పెడితే, bఅందవిహీనంగా తయారయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు..


ప్రస్తుతం ఇలాంటి ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్.. ఈమె తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. ఈమె ఫేషియల్  చేయించుకునేందుకు డాక్టర్ భైరవి సెంథిల్ వద్దకు వెళ్ళింది . అయితే ఈమె ఫెయిల్ అనంతరం తనకు అ అవసరం  లేకపోయినా,  చెప్పినా వినకుండా ఆ డాక్టర్ చేసిన పని వల్ల కంటి కింద వాచిపోయి, కమిలిపోయిందని రైజా విల్సన్ తన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..


ఇక తన ఫాలోవర్స్ ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్నారు. ఇప్పుడు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. తనకు ఇలా జరిగిందని ఆ డాక్టర్ ను కలిసేందుకు,మాట్లాడేందుకు  ప్రయత్నించగా ఆమె నిరాకరించిందని,  ఆమె సిబ్బందిని ప్రశ్నిస్తే మేడం అందుబాటులో లేదని చెప్పారని రైజా  వెల్లడించింది. అంతేకాకుండా డాక్టర్ భైరవి సెంథిల్ దగ్గరకు వెళితే, తమకు కూడా ఇలా జరిగిందని చాలా మంది తనకు ఇన్బాక్స్లో మెసేజ్ చేశారని వారికి ఎదురైన చేదు అనుభవాలు పంచుకున్నారు అని ఆమె చెప్పింది.


రైజా విల్సన్ 2017 లో తమిళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. "వెలైఇల్ల పట్టధరి2 " సినిమా లో ఒక చిన్న పాత్ర చేసింది.  ఆ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని "ప్యార్ ప్రేమ కాదల్" చిత్రంలో హరీష్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.  తన నటనకు గాను ఆమె బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక అంతే కాకుండా ఓటీటీ లో కూడా 2020 లో విడుదలైన వర్మ చిత్రంలో కూడా ఈమె నటించింది. ఇక తమిళ్ లో కమలహాసన్ హోస్ట్ గా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ గా గుర్తింపు కూడా దక్కింది..


మరింత సమాచారం తెలుసుకోండి: