టాలీవుడ్ లో దర్శకులకు గండం వెంటాడుతూనే ఉంది. శాయాశక్తులా కష్టపడి.. తమ టాలెంట్ అంతా జోడించి తొలి సినిమాతో హిట్ కొట్టేస్తున్నారు. అదే ఊపుతో రెండే సినిమా తీస్తే మాత్రం ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. ఇలాంటి అనుభవం చాలా మంది దర్శకులకు ఎదురైంది.  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇపుడు యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఏమని బాహుబలిలో నటించాడో గానీ అప్పటి నుంచి పాన్ ఇండియన్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఆయనతో సినిమాలు తీసేందుకు టాలీవుడ్ దర్శక, నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ వాళ్లు కూడా ఎగబడుతున్నారు. అంటే ప్రభాస్ క్రేజ్ ఎంత మాత్రం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో ఒక్క సినిమా చేస్తే తమ సుడితిరుగుతుందని దర్శకులు ఆరాటపడుతున్నారు. అయితే రాధాకృష్ణ కుమార్ కు ప్రభాస్ తో సెకండ్ మూవీ తీసే అవకాశం కొట్టేశాడు. రాధేశ్యామ్ తో తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

రాధాకృష్ణ కుమార్.. గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వ బాధ్యత  వహించాడు. ఈ సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. తర్వాత కష్టపడి ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రభాస్ ను సరికొత్తగా చూపిస్తూ ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు.  మరి రాధేశ్యామ్ మూవీ రాధాకృష్ణను హిట్ బాట పట్టిస్తుందో.. లేక రొటీన్ గా వస్తోన్న సెంటిమెంట్ ను అమలు చేస్తుందో చూడాలి.

ఇక అజయ్ భూపతి కూడా టెన్షన్ లో ఉన్నాడు. ఆర్ ఎక్స్ 100తో మంచి హిట్ కొట్టిన ఈ దర్శకుడు రెండో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ తో తీస్తున్న మహాసముద్రం మూవీ తీస్తూ.. కలలు కంటున్నాడు. ఎలాగైనా ఈ సినిమాను హిట్ బాట పట్టించాలని చెమటోడుస్తున్నాడు.

ఇక దర్శకుడు స్వరూప్... డిటెక్టివ్ కథాంశంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తీసి ప్రేక్షకుల ఆదరణను పొందాడు. మిషన్ ఇంపాజిబుల్ పేరు రెండో సినిమా తీస్తూ తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చూద్దాం.. ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: