మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ లు కలిసి ఒకే బెడ్ పై పడుకున్న ఫోటో ఒకటి షేర్ చేశాడు సాయి ధరం తేజ్. కొన్ని ఎప్పటికి మారవంటూ కామెంట్ పెట్టాడు. మెగా హీరోలు ముగ్గురు ఇలా బెడ్ పై పడుకోవడం ఆ పిక్ సాయి తేజ్ షేర్ చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మెగా హీరోలు తము ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ఆ క్రమంలోనే బెడ్ పై ముగ్గురు హీరోలున్న పిక్ వదిలారు. ఇక ఈ ఫోటోలో వైష్ణవ్ తేజ్ నిద్రపోగా వరుణ్ తేజ్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు.

సెల్ఫీ తీసిన సాయి ధరం తేజ్ కూడా నిద్రపోతున్నట్టుగా కళ్లు మాత్రం మూసుకుని ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగా క్లిక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఎంజాయ్ మూడ్ లో ఉన్న మెగా హీరోల హంగామా చూసి సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ముగ్గురు హీరోలు వారి వారి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఉప్పెన హిట్ తో వైష్ణవ్ తేజ్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా క్రిష్ డైరక్షన్ లో సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఇక సాయి ధరం తేజ్ రిపబ్లిక్ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఎఫ్3, గని సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉంటున్నా మెగా హీరోలు ఒకచోట కలిశారంటే ఆ అల్లరి వేరే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.  సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ఫోటోలతో కూడా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు మెగా హీరోలు. వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురు కలిశారు అంటే ఆ రచ్చ వేరే రేంజ్ లో ఉంటుంది. వాళ్లు కలిసిన ప్రతిసారి అదో పండుగ్ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: