ప్రస్తుతం రవితేజ మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. వీటిల్లో ముందుగా ఖిలాడీ సినిమా వస్తోంది. ఖిలాడీ అంటూ టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు రవితేజ. ఖిలాడీ సినిమా తరువాత కొత్త దర్శకుడు శరత్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. రవితేజ కెరీర్ లో ఈ ఎమ్మార్వో 68వ ప్రాజెక్టుగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి అయిన ఎమ్మార్వో రోల్లో నటిస్తాడని అంటున్నారు. విచిత్రం ఏంటంటే పుష్ప సినిమాలో ఎర్ర చందనం అక్రమ స్మగ్లింగ్ నేపథ్యం ఎలా ? ఉంటుందో ? ఇప్పుడు ఎమ్మార్వో సినిమాలోనూ ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు ఉంటాయని చెపుతున్నారు.
ఇక ఈ సినిమాను పడిపడి లేచె మనసు లాంటి మంచి సినిమాను అందించిన సుధాకర్ నిర్మిస్తున్నారు. వాస్తవంగా రవితేజ ఖిలాడీ తర్వాత నక్కిన త్రినాథరావు ( సినిమా చూపిస్త మావ, నేను లోకల్ ఫేం ) దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కథలో మార్పులు. చేర్పులు చేయాలని సూచిండంతో ఆ ప్రాజెక్టు వెనక్కు వెళ్లి ఎమ్మార్వో ముందుకు వచ్చింది . ఈ సినిమా రెగ్యులర్ షూట్ గురవారం నుంచి ప్రారంభం అవుతుందని యూనిట్ ప్రకటించింది.