శ్రీముఖి బుల్లితెరపై తన అల్లరి చేష్టలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈమె హీరోయిన్ అవ్వాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నప్పటికీ, అవకాశాలు లేక ఛాన్స్ రాకపోవడంతో వాటి కోసం వేచి చూసేది. అలా ఇప్పుడు"క్రేజీ అంకుల్స్" సినిమాలో ఛాన్స్ రావడం చేత,ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాని కొంతమంది మహిళలు నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తున్నారట. వాటి వివరాలను చూద్దాం.


ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. మొన్నామధ్య ఒక పాట మీద కూడా ఇలానే చేశారు. క్రేజీ అంకుల్ సినిమాపై కూడా ఇప్పుడు అలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సినిమా కామెడీ పరంగా బాగున్నా మహిళల పట్ల కించపరిచే విధంగా ఉన్నట్లు.. అయితే ఇలాంటి సినిమాలు చూడడం వల్ల కుటుంబాల మధ్య  చిచ్చులు పెట్టుకోవాల్సి వస్తుంది.. అనే ఉద్దేశంతోనే,  ఈ సినిమాని.. ఆపివేయాలని మహిళా సంఘం వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక మహిళలు మాట్లాడుతూ.. సినిమాల ద్వారా మంచి చేయకున్నా పర్వాలేదు. కానీ ఇలాంటి అసభ్యకరమైన సినిమాలు చేయడం వల్ల సమాజం చెడిపోతుంది.. అంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తీసివేయాలని కూడా, మహిళా సంఘాల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలాగే సినిమా ఆడాలి అనుకుంటే , ఈ సినిమాని థియేటర్లో ఆడనిచ్చేది లేదు అని తెలియజేస్తున్నారు.

ఇక ఇందులో శ్రీముఖి మెయిన్ పాత్రలో నటిస్తూండగా.. మరొక నటుడు రాజా రవీందర్, తనికెళ్ళ భరణి, మనో, పోసాని , కృష్ణ మురళి కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి బడా నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒక పాత్రలో కనిపించాడు. అయితే విడుదల అయిన ఈ సినిమా తో ,  ఇప్పుడు ఈ విషయం పై చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో. అందుకే ఎలాగైనా సరే మహిళలను కించ పరుచు కోకుండా ఉండేందుకు, సినిమా మేకర్ వారు అసభ్యకరమైన సన్నివేశాలు తొలగిస్తే చాలా బాగుంటుంది అని మహిళా సంఘాల వారు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: