
అందరూ హీరోలను ఆహ్వానించలేదని విమర్శిస్తున్నారు. కాగా, సినీ ఇండస్ట్రీని ఆదుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ పెద్ద దిక్కుగా ఉండే దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు మరణానంతరం పెద్ద దిక్కుగా చిరంజీవిగా వ్యవహరిస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సినీ కుటుంబాన్ని నడిపించడానికి కుటుంబ పెద్దగా చిరంజీవి బాధ్యతలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇకపోతే కొవిడ్ టైంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ద్వారా చిరు విరాళాలు సేకరించారు. అలానే ఇండస్ట్రీలోని సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి షూటింగ్స్కు పర్మిషన్స్ వచ్చేందుకు చిరు కృషి చేశారు. త్వరలో ఏపీ ప్రభుత్వంతోనూ భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటులందరూ కలిసి మెలిసి ఉండాలని పలువురు కోరుతున్నారు.