తాజాగా నాని ట్యాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే రాహుల్ సంకృత్యన్ ఇండస్ట్రీకి ట్యాక్సీవాలా సినిమాతో పరిచయమైయ్యారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ నటించిన సంగతి అందరికి తెల్సిందే. ఇక ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టితో పాటుగా మళయాళ భామ మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాని డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మధ్య కాలంలోనే విడుదల చేసిన శ్యామ్ సింగ రాయ్ టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో కూడా అంచనాలు నెలకొన్నాయి.
అయితే దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను రానాతో తీయాలని అనుకున్నారంట. ఈ సినిమా స్టోరీని రానాకీ చెప్పి చర్చలు జరిపినట్లు సమాచారం. ఏమైందో తెలియదు కానీ రానా ఈ సినిమను రిజెక్ట్ చేశారంట. రానా ఇదివరకు తను చేసిన సబ్జెక్ట్ లా అనిపించిందో లేక మరే కారణమో తెలియదు కాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను రానా వదులుకున్నారు. ఇక చివరికి ఈ సినిమా స్టోరీ నానికి చేరడం ఆయన ఓకే అనడంతో సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతుంది.