బుల్లితెరపై ఒకప్పుడు బాగా పాపులర్ పొందిన సీరియల్ లేడీ డిటెక్టివ్. ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషించింది ఒక కర్ణాటక అమ్మాయి.. ఇక ఈమె పేరు ఉత్తర.. ఈ సీరియల్ లో ఎక్కడ సమస్య ఉంటే , అక్కడికి వెళ్లి ఆ సమస్యలను పరిష్కరిస్తూ లేడీ డిటెక్టివ్ గా గుర్తింపు పొందింది ఉత్తర. సాధారణంగా సినిమాలలో అబ్బాయిలు డిటెక్టివ్ గా పని చేస్తే, ఇక్కడ ఈ సీరియల్ లో ఉత్తర డిటెక్టివ్ పాత్రలో కనిపించి అందరినీ బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ను సాధించింది. అంతేకాదు ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ కోసం ఎదురు చూసే వాళ్ళు.. ఇక ఎంతలా అంటే ఇప్పటికీ లేడీ డిటెక్టివ్ అనగానే ఉత్తర గుర్తొచ్చే అంతగా.

అమ్మాయి అంతకంటే ముందే రంభ ఊర్వశి మేనక అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, వైదేహి కళ్యాణం అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత జేడీ చక్రవర్తి , శ్రీకాంత్ నటించిన వన్ బై టు సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనిపించి అలరించింది. ఇక అప్పుడే 1995లో ఈటీవీ ఛానెల్ ను రామోజీరావు స్థాపించాడు. ఇక జంధ్యాల దర్శకత్వంలో అబద్ధాల పెళ్లిళ్లు అనే సీరియల్ తెరకెక్కుతుండగా అందులో ఉత్తర నటించింది. ఆమెతో పాటు ప్రముఖ నటులు చిన్న, శివాజీరాజా కూడా నటించారు.

ఆ తర్వాత రామోజీరావు తనయుడు సుమన్ దర్శకత్వంలో వసుంధర సీరియల్ వచ్చింది. ఇందులో కూడా ఉత్తర నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత లేడీ డిటెక్టివ్ సినిమాలో నటించిన ఈమె 10 సంవత్సరాల పాటు సినిమాలు, సీరియల్స్ లో చేసి ప్రస్తుతం నటనకు దూరమైంది ..ఇక ఉత్తర ఇప్పుడు ఎక్కడుందో చాలామందికి తెలియదనే చెప్పాలి. ఏది ఏమైనా  ఉత్తర తిరిగి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: