మాములుగా సోషల్ మీడియాలో ఎక్కువగా నిత్యం ట్రోల్ అయ్యే అంశాలు రెండే రెండు. అందులో ఒకటి క్రికెట్ రెండు సినిమా. ఈ రెండింటికీ ఉన్న పాపులారిటీ మరి దేనికి లేదనే చెప్పాలి. ఇక క్రికెటర్లకు సెలబ్రిటీ లకు మధ్య ప్రేమాయణాలు సదా మామూలే అయిపోయింది ఇలాంటివి తరచూ వింటూనే ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే బాలీవుడ్ మరియు క్రికెట్ కి ఏదో అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఏరికోరి మరీ క్రికెటర్లను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొందరు ప్రేమ దాటి పెళ్లి పీటలు ఎక్కలేదు.

అప్పటి పటౌడీ నుండి బాలీవుడ్ - క్రికెట్ ప్రేమయాణాలు చాలానే మూవ్ అవుతున్నాయి. అయితే తాజాగా మరో క్రికెట్, మూవీ జంట తమ ప్రేమకు బ్రేకప్ చెప్పినట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతెలా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ తో ప్రేమలో పడిందని వీరిద్దరూ గత కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు అని చాలా రోజుల నుండి వార్తలు వినపడుతున్నాయి . కాగా ఇప్పుడు వారి ప్రేమకు బ్రేకప్ చెప్పి రిలేషన్ ను కట్ చేసుకున్నారని తెలుస్తోంది.  ఇంతకీ అసలు ఏమైంది అంటే...

ఊర్వశి రౌతెలా టీమిండియా ప్రముఖ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో రిలేషన్‌లో ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. కానీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా తమ ప్రేమ వ్యవహారం గురించి ఏ సందర్భం లోనూ చెప్పలేదు.  అయితే వీరు కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుండగా పలుమార్లు కెమెరా కళ్ళకు మాత్రం చిక్కారు. అప్పట్లో అవి ఎంత వైరల్ గా మారాయి తెలిసిందే. అయితే ఇపుడు ఈ జంట తమ బంధానికి బ్రేకప్ చెప్పడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా ఒకరి నంబర్లు ఒకరు వాట్స్ యాప్ లో బ్లాక్ చేసుకుని మరీ రిలేషన్ పూర్తిగా కట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.  ఏదేమైనా ఈ ప్రేమ జంట విడిపోతుంది అన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: