పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ శ్రీవల్లి పాట ఆకర్షించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. దీంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం శ్రీవల్లి పాట పై డాన్స్ చేసి ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేశారు. ఇలా భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా శ్రీవల్లీ మేనియా నడిచింది. ఇక ఇప్పుడు పుష్ప లోని శ్రీవల్లి పాట పై కమెడియన్ రాజకీయ నాయకుడు బాబు మోహన్ తనదైన శైలిలో డాన్స్ చేశారు. ఇక ఇది చూసిన అభిమానులు అందరూ తెగ మురిసిపోతున్నారు అని చెప్పాలి.
ప్రస్తుతం ఈ టీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ఒకప్పుడు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలో నటించి స్టార్ కారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలిగిన సీనియర్లు అందర్నీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లుగా పిలిచారు. ఈ క్రమం లోనే ఇక బాబు మోహన్ మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో కలిసి డాన్స్ చేశాడు. బాబు మోహన్ అదిరిపోయే స్టెప్పులు వేసిన తీరు అందరినీ ఆకర్షించింది.