త్రివిక్రమ్ తో కలిసి నటించాల్సిన సినిమాలో పలు పూజా కార్యక్రమం పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇందులో పూజ హెగ్డే మరొకసారి మహేష్ తో జత కట్టనుంది. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు పొందిన రాజమౌళి మహేష్ తో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఒక విషయం బయటికి వెలువడింది. అయితే ఈ చిత్రం పై వస్తున్న బడ్జెట్ వార్తలపై మరొక వార్త వినిపిస్తోంది.. అదేమిటంటే ఈ చిత్రానికి 800 వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నరని వార్త వినిపిస్తోంది కానీ ఇది కేవలం అభిమానుల యొక్క ఊహాగానాలు అన్నట్లుగానే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాలపై అభిమానులు, ప్రేక్షకులు సైతం ఊహించుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. అయితే మహేశ్,రాజమౌళి కాంబోలో సినిమా రాబోతోంది అంటే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మహేష్ ఇమేజ్కు తగ్గట్టుగా.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మహేష్ అభిమానులు ఎలా కోరుకుంటారో అలా చూపిస్తానని విజయేంద్రప్రసాద్, రాజమౌళి కూడా గతంలో తెలియజేశారు. మరి ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.