ఇప్పటికే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా.. అటు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కూడా ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఓవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇంకో వైపు ఢీ కార్యక్రమంలో కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఇక వీటితో ఎంటర్టైన్మెంట్ సరిపోలేదు అన్నట్లు ఇక ఇప్పుడు సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఈటీవీ నిర్వాహకులు.
ఈ క్రమంలోనే జాతిరత్నాలు అని ఒకసారి సరికొత్త షో ప్లాన్ చేశారు అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి జాతి రత్నాలు కార్యక్రమం తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుసగా ప్రోమో విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఈ కార్యక్రమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇటీవలే మరో ప్రోమో విడుదల చేశారు ఇక ఈ ప్రోమో కాస్త అదిరిపోయింది అని తెలుస్తూ ఉంది. ఇక ఈ కార్యక్రమం నాన్ స్టాప్ నవ్వుల పంచేసేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో చూస్తుంటే ఇక ఈ కార్యక్రమం కూడాఎంటర్టైన్మెంట్ పంచడం పక్క అని నమ్ముతున్నారు ప్రేక్షకులు.