టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలు వారి కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.  ఈ నలుగురు హీరోలు కూడా ఈ మధ్య విడుదలైన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను రాబట్టారు. మరి తాజాగా ఈ హీరోలు నటించిన సినిమాలతో 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ హీరో ఎన్ని కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు తెలుసుకుందాం.

వెంకటేష్ : విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన ఎఫ్ 3 మూవీ విడుదలైన రెండవ రోజు 8.35 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు.


నాగార్జున : టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా బంగార్రాజు సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు 7.80  కోట్ల కలెక్షన్ల ను సాధించింది.


బాలకృష్ణ : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని విడుదలైన రెండవ రోజు 6.83 కోట్ల కలెక్షన్లను సాధించింది.


చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా విడుదలైన రెండవ రోజు 4.5 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ఇలా తాజాగా విడుదలైన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్లను వెంకటేష్ నటించిన ఎఫ్ 3 మూవీ కి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: