ప్రస్తుతం పాన్ ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న `సలార్‌`కి ఇంకా ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్టు `NTR31`కి సంబంధం ఉందని తెలుస్తుంది. ఇక అదే సమయంలో `కేజీఎఫ్‌ 3` సినిమా కూడా రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. `కేజీఎఫ్‌ 2`సినిమాలోనూ అదే విషయాన్ని ఆయన హింట్‌ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నీల్‌ మదిలో మరో ఆలోచన ఉందట. ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.`కేజీఎఫ్‌`సినిమా రెండు పార్ట్ ల్లో `కోలార్‌ గోల్డ్ ఫీల్డ్`లో ఓ అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె పాపని హీరో యష్‌(రాఖీభాయ్‌)కాపాడతాడు. ఆ పాపకి తన తల్లి పేరు కూడా పెడతారు హీరో రాఖీభాయ్‌. అయితే రెండో పార్ట్ లో రాఖీభాయ్‌ చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ధైర్యాన్ని ఇంకా డేర్‌నెస్‌ని పునికి పుచ్చుకుని ఆ అమ్మాయి వీర వనితలా ఎదగబోతుందని ఇంకా ఆమె ఓ యోధురాలిగా మారి కేజీఎఫ్‌లో తను నాయకురాలిగా ఎదిగి తన ప్రత్యర్థులపై పోరాడటం అనే కథాంశంతో ఈ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాని ప్రశాంత్‌ నీల్‌ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.



దీని కథని కూడా డెవలప్‌ చేశారని సమాచారం తెలుస్తుంది.మరి ఇక ఈ సినిమా ఎప్పుడుంటుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ప్రశాంత్‌ నీల్‌ మాత్రం ఈ స్టోరీతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం తెలుస్తుంది. హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌` సినిమాని రూపొందిస్తున్నారు. మైనింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇక ఇందులో మైనింగ్‌ కార్మికులకు నాయకుడిగా హీరో ప్రభాస్‌ కనిపిస్తారని తెలుస్తుంది. అలాగే శృతి హాసన్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఈ సంవత్సరం చివరల్లో ఎన్టీఆర్‌ సినిమాని పట్టాలెక్కించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

KGF