అయితే ఇలాంటి సందేహాలకు ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు కేవలం అభిమానుల మధ్య మాత్రమే కాకుండా మీడియాకు కూడ హాట్ టాపిక్ గా మారింది. ‘ఆదిపురుష్’ మూవీలో శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు అన్నవిషయం పై క్లారిటీ ఇస్తూ ఓం రౌత్ కొన్ని కీలక కామెంట్స్ చేసాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ కళ్ళల్లో కనిపించే ప్రశాంతత అదేవిధంగా రౌద్రం మరెవ్వరి కళ్ళలోను కనిపించదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఒకవ్యక్తి కళ్ళు చూసి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని ప్రభాస్ మృదు స్వభావి కావడంతో అతడి కళ్ళు ఎప్పుడు నిర్మలంగా ఉంటాయని అయితే కోపం వచ్చినప్పుడు మాత్రం అతడి కళ్ళల్లో అగ్ని శిఖలు కురుస్తాయని అభిప్రాయ పడుతున్నాడు. శ్రీరాముడు కూడ మానవ రూపంలో ఉన్న మహనీయ వ్యక్తి అని ఆయనంత సాధుస్వభావి ఉగ్రరూపి మరొకరు ఉండరు అని చెపుతూ ఆ లక్షణాలకు ప్రభాస్ కళ్ళు సరిపోతాయి కాబట్టి తాను శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ ను ఎంపిక చేసిన విషయాన్ని బయటపెట్టాడు.
500 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ జరుపుకుంటున్న ఈమూవీ కోసమే సుమారు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నవార్తలు వస్తున్నాయి. ఈమూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది అని ఓం రౌత్ చెపుతున్నాడు. అయితే తెలుగు ప్రజలకు శ్రీరాముడు అంటే నందమూరి తారకరామారావు రూపం తప్ప మరెవ్వరి రూపం గుర్తుకు రాదు. అలాంటి పరిస్థితులలో మన తెలుగు ప్రేక్షకులు శ్రీరాముడు గా ఎంతవరకు ఆదరిస్తారు అన్నది వేచిచూడాలి..