యంగ్ హీరో రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ చిత్రంతో మళ్లీ వీరిద్దరూ ట్రాక్ లొకి వచ్చారు. ఇద్దరు తొలి కాంబినేషన్ కావడమే కాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుతుంది. ఈ చిత్రం సక్సెస్తో రామ్ తన రెమ్యునరేషన్ని పెంచేశారు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఎక్కడ నేగ్గలో కాదు, ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. వాటి గురించి చూద్దాం.


వివరాల్లోకి వెళితే హీరో రామ్ ప్రస్తుతం తమిళ యాక్షన్ చిత్ర డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. జూలై 14న విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు చిత్ర బృందం. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నది. ముఖ్యమైన పాత్రలు నటి అక్షర గౌడ కూడా కనిపించబోతోంది. విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇక అంతే కాకుండా సీనియర్ దర్శకుడు భారతీరాజా నదియా, బ్రహ్మాజీ ఇతరులు కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం రూ.10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నడు రామ్.


కానీ రామ్ తన 20 వ చిత్రానికి మాత్రం సగానికి సగం తగ్గించడంతో ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేస్తోంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం కూడా త్వరలోనే షూటింగ్ రెగ్యులర్గా జరుపుకోనుంది. ఈ చిత్రానికి ముందుగా రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా చివరికి రూ.7 కోట్లతో రామ్ సరి పెట్టుకున్నట్లుగా సమాచారం. బోయపాటి శ్రీను కూడా ఈ చిత్రానికి ముందుగానే భారీగా డిమాండ్ చేశారు. కాని ప్రస్తుతం ఈ సినిమా కోసం రూ 8 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే ఇలా తగ్గించడానికి ముఖ్య కారణం సినిమా లాభాలలో వాటా తీసుకోవడమే అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: