ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. ఈరోజు ఈ
సినిమా జనవరి 12వ తేదీన
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నట్లుగా ఇచ్చిన ఈ ప్రకటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో సంతోషం నెలకొంది అని చెప్పవచ్చు.
బాహుబలి
సినిమా తర్వాత చేసిన రెండు భారీ చిత్రాలు
ప్రభాస్ ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచాయి దాంతో ఇప్పుడు చేసే ఈ
సినిమా తప్పకుండా భారీ విజయం అందుకోవాల్సిన నేపథ్యంలో చేసిన ఈ మైథాలజికల్
సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అన్న ఆత్రుత ప్రతి ఒక్కరిలో ఉంది ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఈ
సినిమా ఎంత భారీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ
సినిమా కోసం దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లుగా చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. రామాయణం ఆధారంగా ఈ
సినిమా రూపొందుతుండగా విడుదల తర్వాత ఈ సినిమాకు ఎంతటి స్థాయిలో గుర్తింపు వస్తుందో చూడాలి. రాముడుగా
ప్రభాస్ నటిస్తూ ఉండగా సీతగా
కృతి సనన్ నటిస్తుంది. లక్ష్మణుడిగా సన్నీ నటిస్తున్నారు. రావణాసురుడుగా విలన్ పాత్రలో
బాలీవుడ్ స్టార్
హీరో అలీ ఖాన్ నటిస్తూ ఉండడం ఈ సినిమాపై ఇంతటి అంచనాలు ఏర్పడడానికి కారణం అవుతుంది. మరి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విజయం ఈ సినిమాతో అందుకొని విమర్శకులకు సరైన సమాధానాన్ని
ప్రభాస్ చెబుతాడా అనేది చూడాలి. ఇక ఈ
సినిమా తర్వాత అయన చేయబోయే సినిమాల జాబితా గట్టిగానే ఉందని చెప్పొచ్చు. పెద్ద దర్శకులతో భారీ సినిమాలనే చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమాలు కూడా ఆయన కు భారీ విజయాన్ని తెచ్చి పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.