మెగాస్టార్ చిరంజీవి ఒక ఊర మాస్ సినిమాలో కనిపించి చాలా ఏళ్లు గడిచిపోవడంతో ఆయన్నుంచి ఎప్పుడెప్పుడు అలాంటి సినిమా వస్తుందా..

అని బాస్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఊర మాస్ సినిమానే చిరంజీవితో తీస్తున్నానని.. దర్శకుడు బాబీ ఫ్యాన్స్ కు చెబుతూ వస్తున్నాడు. ఇవాళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ని ఫిక్స్ చేయడంతో పాటు టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేశారట.

ఈ టీజర్ నిజంగానే బాబీ చెప్పినట్లు గా మెగాస్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. చిరంజీవి పూల చొక్కా ధరించి, లుంగీ పైకి ఎగ్గట్టి స్టైల్‌గా బీడీ తాగుతూ..పొగ వదులుతూ.. ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. 'ఏంట్రా వాడొస్తే పూనకాలే అన్నారట.. అడుగేస్తే అరాచకం అన్నారు..ఏడిరా.. మీ అన్నయ్య..సౌండే లేదు..అని విలన్ అంటుండగానే.. చిరు ఎంట్రీ ఇవ్వడం..విలన్ భరతం పట్టడం ఆకట్టుకుందట.


'ఇలాంటి ఎంటర్ టైనింగ్ ధమాకాలు మళ్లీ మళ్లీ చూడాలి..అనుకుంటే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ టు వీరయ్య' అని చిరంజీవి చెప్పిన డైలాగ్ ఆయన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. చివర్లో చిరు లుంగీ ఎగ్గట్టి గ్లాసెస్ పెట్టుకుంటూ స్టైల్‌ గా నడుచుకుంటూ వెళ్లడం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే లా ఉంది.

ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత చిరు సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌ని మరో స్టేజ్‌కి తీసుకెళ్ళింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.మరో కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నాడట. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా.. తాజాగా విడుదలైన టీజర్‌లో రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారని అంతా భావించారట.. అయితే సంక్రాంతికి థియేటర్లలో కలుద్దాం..అంటూ రవితేజ వాయిస్‌తో బ్యాక్ గ్రౌండ్‌లో చెప్పించారు. ఈ సంక్రాంతికి ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్, విజయ్ హీరో గా నటిస్తున్న వారసుడు, బాలకృష్ణ వీరసింహా రెడ్డితో పాటు చిరు వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే నాలుగు భారీ చిత్రాలకు తగినన్ని థియేటర్లు దొరకడం కష్టం. ఈ నాలుగు సినిమాల్లో ఒక సినిమా పోటీ నుంచి తప్పుకుంటుంద ని ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందట..

మరింత సమాచారం తెలుసుకోండి: