ఇండస్ట్రీలో యాంకర్ రష్మీ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో తో పాపులర్ అయి తరవాత సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మీ.
బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాతో రష్మీ మరోసారి తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మీ. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ లు చేస్తూ పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న రష్మీకి జబర్దస్త్ షో లో అవకాశం వచ్చింది. ఈ షో భారీ హిట్ అవ్వడంతో రష్మీ క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత రష్మీ వెనుదిరిగి చూడలేదు. జబర్దస్త్ తో పాటు ఇతర ప్రోగ్రాంలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది. టీవీ చానెల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సినిమాల్లోనూ నటించింది రష్మీ.

గుంటూరు టాకీస్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న రష్మీ. తర్వాత వరుస అవకాశాలు రావడంతో అటు టీవీ, ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టీవీలో నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ల సినిమాలు అంతగా ఆదరణ పొందవు అని చెప్పింది. టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాల్లో నటిస్తోన్న వారిపై ఒక దురాభిప్రాయం ఉంటుందని, రోజూ టీవీలో చూసేవాళ్లే కదా వీళ్ళ సినిమాలు ఏం చూస్తాంలే అని అనుకునే అవకాశం ఉందని పేర్కొంది. కొద్ది మంది మాత్రమే టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లి సక్సెస్ అవుతారని రష్మీ తెలిపింది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఈ అపోహ ఎక్కువగా ఉంటుందని, తాను కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది రష్మీ. తనకి నటించడం అంటే ఇష్టమని, అందుకే ఇప్పటి వరకూ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నానని, ఇకపై కూడా నటిస్తానని చెప్పింది. సినిమా మీద ఉన్న ఇష్టం తోనే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానని పేర్కొంది.

రష్మీ నటించిన సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, రొమాన్స్, డైలాగ్స్ ఆడియన్స్‌కు నచ్చడంతో మరింత బజ్ పెరిగింది. సినిమా ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు మూవీ టీమ్. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కోసం రష్మీ రానందంటూ మూవీ టీమ్ రష్మీ షూటింగ్ స్పాట్ కు వెళ్లి హడావిడి చేసింది. తీరా అది సినిమా ప్రమోషన్స్ కోసం అని తర్వాత తేలింది. తర్వాత ఆ కార్యక్రమంలో రష్మీ పాల్గొంది. ఇటీవల క్రికెటర్ హర్భజన్ సింగ్ తో ఓ ప్రమోషన్ వీడియో చేసాడు హీరో నందు. ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: