
''జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సొంత ప్రయోజనాల కోసం తన కెరీర్ను నాశనం చేయడానికి నేరపూరితంగా పరువు తీయడానికి ప్రయత్నించారని ఎందుకంటే మేం ఇద్దరం ఒకే పరిశ్రమలో పనిచేస్తున్నాం. ఇతర కారణాలతో సమానమైన నేపథ్యాలు కలిగి ఉన్నారు" అని నోరా ఫతేహి తన అభ్యర్ధనలో పేర్కొంది. కాగా నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అయితే ప్రశ్నించింది.
పీఎంఎల్ఏ కోర్టులో జాక్వెలిన్ లిఖితపూర్వకంగా చేసిన అభ్యర్థనపై నోరా ఫతేహి పరువునష్టం కేసును అయితే దాఖలు చేసింది. ''తనను ఈడీ తప్పుగా చూస్తోంది. అయితే కాన్మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి బహుమతులు పొందిన నోరా ఫతేహి వంటి ప్రముఖులు సాక్షులుగా ఉన్నారు.'' అని జాక్వెలిన్ తన పిటిషన్లో పేర్కొన్నారట. అయితే నటి నోరా ఫతేహి ఆ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనకు నేరుగా సుకేష్ చంద్రశేఖర్తో ఎలాంటి పరిచయం లేదని, అతని భార్య లీనా మారియా పాల్ ద్వారా మాత్రమే పరిచయం ఉందని కూడా తెలిపింది. కాన్మ్యాన్ నుండి ఎలాంటి బహుమతులు అందుకోలేదని నోరా అయితే తెలిపింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో పాటు, నోరా ఫతేహి తన పరువు నష్టం పిటిషన్లో పలు మీడియా సంస్థల పేర్లను కూడా పేర్కొంది.