అయితే భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శక నిర్మాతలు అందరూ కూడా కాంతారా బ్లాక్ బస్టర్ విజయంతో షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా 16 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమాలో నటీనటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దర్శకుడిగా హీరోగా సినిమాకు పనిచేసిన రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోని ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల పారితోషకం ఎంతో తెలుసుకుందాం.
కాంతారా సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా కీలకపాత్రలో నటించిన కిషోర్, రిషబ్ శెట్టి సరసన హీరోయిన్గా నటించిన సప్తమి గౌడ కు కోటి రూపాయల పారితోషికం చెల్లించారట. ఇక రాజుకు వారసుడు పాత్రలో కనిపించిన అచ్యుత్ కుమార్ కు 40 లక్షలు ఇచ్చారట. సుధారక పాత్ర పోషించిన ప్రమోద్ శెట్టి 40 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నాడట. ఇక ఈ సినిమాకు వెన్నుముక అయిన రిషబ్ శెట్టి ఏకంగా నాలుగు కోట్ల పారితోషకం తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో నిర్మాతలు మరికొంత పారితోషికం రిషబ్ శెట్టికి అందించినట్లు తెలుస్తుంది.