ముఖ్యంగా బాలకృష్ణ మార్కెట్ కు మించి ‘వీరసింహా రెడ్డి’ మూవీకి దర్శకుడు గోపీచంద్ మలినేని సూచనలతో ఈమూవీ పై 100కోట్లు ఖర్చుపెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈస్థాయిలో ఇప్పటివరకు బాలకృష్ణ మూవీ పై ఎవరు ఖర్చుపెట్టలేదని దీనితో మైత్రీ సంస్థ ఏధైర్యంతో బాలయ్య పై ఈరేంజ్ లో ఖర్చుపెట్టి ఉంటారు అన్నఅంచనాలు ఇండస్ట్రీ వర్గాలకు కూడ అందడంలేదు అని టాక్.
ఇక చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ పై కూడ చాలభారీగా మైత్రీ సంస్థ ఖర్చు పెట్టడమే కాకుండా ఈమూవీలో నటించిన నటీనటులకు అత్యంత భారీ పారితోషికం ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈమూవీలో ప్రత్యేకపాత్రలో నటిస్తున్న రవితేజా ఈమూవీలో కనిపించేది కేవలం 40 నిముషాలే అయినప్పటికీ రవితేజాకు 17కోట్ల వారి పారితోషికం మైత్రీ మూవీస్ నిర్మాతలు రవితేజాకు ఇచ్చారు అంటూ వస్తున్న వార్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.
మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈరెండు సినిమాల నిర్మాణ ఖర్చు 2వందల కోట్లు దాటిపోవడంతో ఈరెండు సినిమాలు ఒకదాని పై ఒకటి సంక్రాంతికి పోటీగా విడుదల అవుతూ ఉండటంతో ఈరెండు సినిమాలకు కలక్షన్స్ విషయంలో గండిపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఈరెండు సినిమాల బిజినెస్ బాగా జరిగినప్పటికీ టాక్ విషయంలో ఈ రెడు సినిమాలలో ఏసినిమాకు కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చినా అది మైత్రీ సంస్థకు నష్టాలను చేకూర్చే అంశంగా మారే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీలోని మరికొందరు గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్..