ఎన్నో సీక్వెల్స్ వచ్చిన దృశ్యం సినిమా సీక్వెల్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ చిత్రాన్ని ఎన్ని భాషలలో రీమిక్స్ చేసి విడుదలైన కూడా మంచి విజయాలను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా సీక్వెల్స్ రెండు మాత్రమే వచ్చాయి.. ఈ రెండు సీక్వెల్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ బాగా సొంతం చేసుకున్నాయి. మలయాళంలో అగ్ర హీరోగా పేరుపొందిన మోహన్లాల్ చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఇతర భాషలలో సరిత ఇతర హీరోలు నటించారు. ఈ చిత్రాన్ని మలయాల డైరెక్టర్ జితూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.


తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమిక్స్ చేయగా హిందీలో అజయ్ దేవగ లాంటివారు నటించారు. కరోనా సమయంలో కూడా దృశ్యం-2 సినిమా అన్ని భాషలలో విడుదలై ఓటీటి లలో మంచి విజయాలను అందుకుంది. హిందీ వర్షన్ చిత్రాన్ని మాత్రం థియేటర్లో విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రంతో బాలీవుడ్లో సినిమాలు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నాయని చెప్పవచ్చు. దీంతో దృశ్యం-3 కోసం ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సీక్వెల్స్ విడుదలవుతాయా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో వారందరికీ ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు చిత్ర బృందం.


 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా మూడవ భాగాన్ని చేయడానికి పలు సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ, మలయాళం భాషలో ఏకకాలం గా తెరకెక్కించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.. మూడవ భాగం కోసం భారీగానే ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం సీక్వెల్ పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇండియాలోని అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రాలలో ఈ సినిమా ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముగింపు పలకపోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: