తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమిక్స్ చేయగా హిందీలో అజయ్ దేవగ లాంటివారు నటించారు. కరోనా సమయంలో కూడా దృశ్యం-2 సినిమా అన్ని భాషలలో విడుదలై ఓటీటి లలో మంచి విజయాలను అందుకుంది. హిందీ వర్షన్ చిత్రాన్ని మాత్రం థియేటర్లో విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రంతో బాలీవుడ్లో సినిమాలు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నాయని చెప్పవచ్చు. దీంతో దృశ్యం-3 కోసం ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సీక్వెల్స్ విడుదలవుతాయా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో వారందరికీ ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు చిత్ర బృందం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా మూడవ భాగాన్ని చేయడానికి పలు సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ, మలయాళం భాషలో ఏకకాలం గా తెరకెక్కించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.. మూడవ భాగం కోసం భారీగానే ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం సీక్వెల్ పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇండియాలోని అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రాలలో ఈ సినిమా ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముగింపు పలకపోతుందని సమాచారం.