ప్రస్తుత కాలంలో ఒక సాధారణ ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే ఖచ్చితంగా కనీసం 500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టికెట్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు, పాప్ కార్న్ ఖర్చు అన్ని కలిపితే ఈజీగా 1000 పైనే అవుతుంది.ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ గుడ్డిగా సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.ప్రేక్షకులు  సినిమాల విషయంలో తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్నారు.సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప థియేటర్లలో సినిమాను చూడటానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఆదిపురుష్ మూవీ మూడురోజుల ముచ్చట తీరిందని ఈరోజు నుంచి ఆదిపురుష్ మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం చాలా కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఒకసారి హైదరాబాద్ లో బుకింగ్స్ ను కనుక పరిశీలిస్తే అటు త్రీడీలో కానీ ఇటు 2డీలో కానీ ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని సమాచారం తెలుస్తుంది.హైదరాబాద్ లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో  లేదని సమాచారం తెలుస్తుంది.


ఇక రేపటి నుంచి ఆదిపురుష్ సినిమా చరిత్ర ముగిసినట్లేనని ఈ సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో కలెక్షన్లను ఆశిస్తే మాత్రం ఖచ్చితంగా అత్యాశే అవుతుందని నెట్టింటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆదిపురుష్ సినిమా నష్టాలు కూడా ఖచ్చితంగా భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం తెలుస్తోంది. ఓం రౌత్ చక్కటి అవకాశాన్ని అసలు ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆదిపురుష్ సినిమాను  ఒక రేంజ్ లో ఊహించుకున్నామని ఈ సినిమా మాత్రం మరో విధంగా ఉందని నెటిజనుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా 200 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలను మిగిల్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ నష్టాలను మేకర్స్ ఏ విధంగా భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. అయితే ఈ దెబ్బతో అయిన ప్రభాస్ తన సినిమాల కథలు ఇంకా వాటి బడ్జెట్ల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇక రాబోయే సలార్ సినిమా అయినా ప్రభాస్ స్టార్ డమ్ రేంజ్ హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: