ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ప్రస్తుతం అనేక మంది స్టార్ హీరోలతో సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. 

దానితో ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీ లో షాహిద్ కపూర్ తో ఈ దర్శకుడు తెరకెక్కించాడు. ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందబోయే స్పిరిట్ సినిమాకు ... ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా రూపొందబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా ... రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటో బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి బయటకు వచ్చిన ఫోటోలో సందీప్ రెడ్డి వంగా ... రణ్బీర్ కపూర్ ... రష్మిక మందన లతో పాటు మరి కొంత మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: