మెగా వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరస సినిమా కథలతో దుమ్ము లేపుతున్నారు. మొదట ముకుంద సినిమాతో తన సినీ కెరీయర్ని ప్రారంభించిన వరుణ్ తేజ్ చివరిగా గని సినిమా వరకు సరికొత్త డిఫరెంట్ కథలనే ఎంచుకోవడం జరిగింది. అయితే ఈసారి యాక్షన్ త్రిల్లర్ గా మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఆ చిత్రమే గాండీవధారి అర్జున.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది.


ఈ చిత్రంలో వరుణ్ చాలా స్టైలిష్ లుక్కులు కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది .అయితే ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ముందే ప్రకటించడం జరిగింది.. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో అనేక వార్తలు కూడా వినిపించాయి.. సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదని ఆగస్టు నెలలో రావడం కష్టమేనని టాక్ వినిపించింది.. అలాగే చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా ఆగస్టులో విడుదల కావడంతో వరుణ్ తేజ్ కాస్త వెనక్కి తగ్గారని వార్తలు వినిపించాయి.


కానీ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ చిత్రబృందం.. గాండీవధారి అర్జున సినిమా కూడా అనుకున్న తేదీకి వస్తుందని ప్రకటించారు మరొకసారి ఈ సినిమా రిలీజ్ డేట్ లో కన్ఫర్మ్ చేస్తూ ఒక మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. మిక్కీ జయ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏడాది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. మరి వివాహ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: