డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం లో బాలకృష్ణ రోజా రంభ ప్రధాన పాత్ర లలో నటించిన చిత్రం భైరవద్వీపం.సినిమా రిలీజ్ అయి దాదాపు 29ఏళ్లు పూర్తి చేసుకుంది. ముప్పై ఏళ్ల కి చేరువ లో ఉన్న నేపథ్యం లో ఇప్పుడు ఈ సినిమా ని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 5న 4కే రిజల్యూషన్ తో ఈ మూవీ ని విడుదల చేస్తుండటం విశేషం. క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్స్ పతాకం పై పీవీ గిరి రాజు, పి దేవ్ వర్మ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటు వంటి ఈ సినిమా తిరిగి విడుదలవుతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇప్పటి కే బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయాని కి వస్తే వీరసింహా రెడ్డి సినిమా తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటు వంటి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో భగవంత్ కేసరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడాని కి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.