‘సలార్’ విడుదల అవ్వకుండానే ప్రభాస్ మరో కొత్త సినిమాకు లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ ‘రాజా డీలక్స్’ సినిమాల షూటింగ్ కొనసాగిస్తూనే ప్రభాస్ సందీప్ వంగా దర్శకత్వంలో నటించబోయే స్పిరిట్ మూవీ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని ప్రభాస్ నుండి దర్శకుడు సందీప్ వంగా కు స్పష్టమైన సూచనలు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.



అర్జున్ రెడ్డి అనీల్ కపూర్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘యానిమల్’ మూవీ విడుదలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఈమూవీ పై రోజురోజుకీ అంచనాలు బాగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ఈమూవీ కలక్షన్స్ విషయంలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంటున్నారు. ఈ మూవీ రిజల్ట్ తెలియకుండానే ఇప్పుడు ప్రభాస్ నుండి స్పిరిట్ విషయంలో లైన్ క్లియర్ అవ్వడంతో సందీప్ వంగా టీమ్ ఈమూవీ ఫైనల్ స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.



అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ మార్చి నెలలో ప్రారంభం అయి 2025 సమ్మర్ రేస్ కు విడుదల అయ్యేలా సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో టీ సిరీస్ సంస్థ నిర్మాణం జరుపుకుని ఈమూవీ కోసం అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన టెక్నీషియన్స్ పని చేస్తారని వార్తలు వస్తున్నాయి.



ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే వచ్చేనెల క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘సలార్’ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఇంకా మొదలు కాకపోవడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు వరస పరాజయాలతో కొనసాగుతున్న ప్రభాస్ కెరియర్ కు ‘సలార్’ విజయం అత్యంత కీలకం కావడంతో ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్నది ప్రభాస్ అభిమానుల సందేహం. దీనికితోడు ఈమూవీకి సంబంధించి ఇంకా రీఘాట్ కొనసాగుతోంది అని వస్తున్న గాసిప్పులు మరింత షాకింగ్ గా మారుతున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: