టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే యూత్ ఆడియన్స్ కి ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవి మ్యూజిక్ అందించిన సినిమా కేవలం మ్యూజిక్ కోసం చూసేయొచ్చు అనేంతగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.భారీ బడ్జెట్ సినిమా అయినా చిన్న సినిమా అయినా బడ్జెట్ తో సంబంధం లేకుండా తన పాటలతో బొమ్మ సూపర్ హిట్ అయ్యేలా చేస్తాడు దేవి.అయితే ఇదంతా ఒకప్పుడు దేవి ఇప్పుడు దేవి ఇలా కాదని అనుకుంటున్నారు ఫ్యాన్స్.ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో దేవి మార్క్ మిస్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవి లో కసి తగ్గిందని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. నేను మారలేదు నేను మునుపటి దేవినే అని అప్పుడప్పుడు డీఎస్పీ ప్రూవ్ చేసుకుంటున్నా కానీ ఆహా ఒకప్పటి దేవి శ్రీ వైబ్స్ అయితే రావట్లేదు. పుష్ప 1 తో దేవి తన మార్క్ ఏంటో చూపించాడు. సుకుమార్ దేవి శ్రీ అల్లు అర్జున్ కాంబో అంటే చాలు ఆ అంచనాలకు తగినట్టుగా మ్యూజిక్ అనేది అదిరిపోతుంది.పుష్ప 1 హిట్ లో దేవి మ్యూజిక్ అనేది మెయిన్ ప్లస్ పాయింట్.అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రౌడీ బాయ్స్, ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు, ది వారియర్, రంగ రంగ వైభవంగా ఇలా అన్ని వరుస ఫ్లాపులు పడ్డాయి.


వీటిలో ఖిలాడి, ది వారియర్ సినిమాలో సాంగ్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగిలిన సినిమాల్లో దేవి మార్క్ మ్యూజిక్  కనిపించలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ ని కొంత అలరించింది.ఇక ఈ ఏడాది దేవి సినిమాల లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమాతో పాటుగా నాగ చైతన్యతో తండేల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు దేవి చేతిలో ఉన్నాయి. ఇంకా వీటితో పాటుగా నాగార్జున ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమాలతో డిఎస్పి అంటే ఏంటో మరోసారి చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.ఓ పక్క పోటీగా థమన్ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తుండగా మలయాళం నుంచి హేషం అబ్ధుల్ వాహబ్, తమిళ పరిశ్రమ నుంచి అనిరుద్, జివి ప్రకాష్, జిబ్రాన్, సంతోష్ నారాయణన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి కూడా రాజమౌళితో పాటు బయట దర్శకులకు సంగీతం అందిస్తున్నారు. ఈ టైం లో దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: