సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. టాలీవుడ్ తో పాటు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ హాట్ బ్యూటీ.రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రీసెంట్ గా రిలీజైన యానిమల్ మూవీతో కూడా ఈ హాట్ బ్యూటీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ మూవీ రష్మికకి పుష్ప కంటే ఎక్కువ క్రేజ్ ని తీసుకొచ్చింది.ఈ సినిమా ఏకంగా 927 కోట్ల వసూళ్ళని రాబట్టి బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా గతేడాది రెయిన్ బో అనే సినిమాని ఈ బ్యూటీ స్టార్ట్ చేసింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.


 బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. కానీ నెక్స్ట్ షెడ్యూల్ ను మాత్రం మేకర్స్ ఇంకా మొదలుపెట్టలేదు. ఈ సినిమాకి రష్మిక రష్మిక మరింత ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. తరువాత దానికి మేకర్స్ కూడా ఒప్పుకున్నారట.అయినా కానీ ఈ స్టోరీలో కొన్ని కంటెంట్ ఎలిమెంట్స్ ను మార్చమని రష్మిక కోరిందట. దీంతో మేకర్స్ ఈ మూవీ నుంచి రష్మిక మందన్నని తీసి పక్కన పెట్టేశారని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెయిన్ బో ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంది. మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు మళ్లీ స్టార్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం పుష్ప2, గర్ల్ ఫ్రెండ్ సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. అలాగే యానిమల్ సినిమా యానిమల్ పార్క్ లో కూడా రష్మిక మందన్న నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: