`ఆర్ఆర్ఆర్`లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అజయ్ దేవగన్ నటించారు. ఆయన పాత్ర నిడివి ఎనిమిది నిమిషాలు. ఇందుకోసం ఆయనకు నిర్మాత డీవీవీ దానయ్య 35కోట్లు పారితోషికం ఇచ్చాడట. అలా ఆయనకు నిమిషానికి 4.5కోట్ల పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఆయన సినిమా మొత్తం ఉంటే రెండు వందల కోట్లు కూడా దాటేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన హీరోగా సినిమా చేసినా 35కోట్లే పారితోషికం తీసుకుంటారట. కానీ సినిమా సక్సెస్ అయితే ప్రాఫిట్లో 50శాతం షేర్ తీసుకుంటారట. అలా ఆయనకు ఒక్కో సినిమాకి వంద కోట్లకుపైగానే పారితోషికంగా దక్కుతుందని చెప్పొచ్చు.ఇప్పుడు చాలా మంది హీరోలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. పారితోషికం తక్కువ తీసుకుని ప్రాఫిట్లో షేర్ తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న `ఎస్ఎస్ఎంబీ29`కి కూడా మహేష్ అలానే పారితోషికం కాకుండా ప్రాఫిట్లో షేర్ తీసుకోబోతున్నారట. అదే సమయంలో నిర్మాణంలోనూ భాగమవుతున్నారట. ఆయనతోపాటు మిగిలిన బిగ్ స్టార్స్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారని తెలుస్తుంది.
`ఆర్ఆర్ఆర్`లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అజయ్ దేవగన్ నటించారు. ఆయన పాత్ర నిడివి ఎనిమిది నిమిషాలు. ఇందుకోసం ఆయనకు నిర్మాత డీవీవీ దానయ్య 35కోట్లు పారితోషికం ఇచ్చాడట. అలా ఆయనకు నిమిషానికి 4.5కోట్ల పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఆయన సినిమా మొత్తం ఉంటే రెండు వందల కోట్లు కూడా దాటేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన హీరోగా సినిమా చేసినా 35కోట్లే పారితోషికం తీసుకుంటారట. కానీ సినిమా సక్సెస్ అయితే ప్రాఫిట్లో 50శాతం షేర్ తీసుకుంటారట. అలా ఆయనకు ఒక్కో సినిమాకి వంద కోట్లకుపైగానే పారితోషికంగా దక్కుతుందని చెప్పొచ్చు.ఇప్పుడు చాలా మంది హీరోలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. పారితోషికం తక్కువ తీసుకుని ప్రాఫిట్లో షేర్ తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న `ఎస్ఎస్ఎంబీ29`కి కూడా మహేష్ అలానే పారితోషికం కాకుండా ప్రాఫిట్లో షేర్ తీసుకోబోతున్నారట. అదే సమయంలో నిర్మాణంలోనూ భాగమవుతున్నారట. ఆయనతోపాటు మిగిలిన బిగ్ స్టార్స్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారని తెలుస్తుంది.