సుజిత్ నాని కాంబో సినిమాలో ముందు బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం జరిగింది. తెలుగులో చేతిలో ఒక్క సినిమా లేక పూజా హెగ్దే డీలా పడింది. అయితే నాని సినిమాలో ఛాన్స్ ఆమెకు బూస్టింగ్ ఇస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్య శ్రీ బోర్స్ కు ఈ ఛాన్స్ వరించిందని తెలుస్తుంది.
బాలీఎవుడ్ లో యారియాన్ 2 సినిమా లో నటించిన భాగ్య శ్రీ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న భాగ్య శ్రీ ఆ సినిమా పూర్తి కాకుండానే నాని సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. నాని సినిమాలో హీరోయిన్స్ కు కూడా మంచి బలం ఉంటుంది. మరి భాగ్య శ్రీకి అలాంటి ఛాన్స్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. భాగ్య శ్రీ చూస్తుంటే తెలుగులో కొన్నాళ్లు బాగా వినిపించే పేరులా ఉందనిపిస్తుంది. రవితేజ తో మిస్టర్ బచ్చన్ నాని31 సినిమాలతో తెలుగులో అదరగొట్టే క్రేజ్ ఏర్పరచుకుంటుంది అమ్మడు.