ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ జీవించి ఉన్న రోజులలో ప్రతి సమ్మర్ కు అల్లరి నరేష్ ను హీరోగా పెట్టి ఒక సూపర్ హిట్ మూవీ తీయడం పరిపాటిగా ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కితకితలు’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలు ఇప్పటికీ టీవీ లలో వస్తున్నప్పుడు ఈనాటితరం ప్రేక్షులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఈమధ్య కాలంలో హాస్య సినిమాలకు దూరం అయిన అల్లరోడు తిరిగి తనకు కలిసి వచ్చిన కామెడీ జోనర్ ను పట్టుకుని మళ్ళీ ‘ఆఒక్కటీ అడక్కు’ అంటూ ఈవారం వస్తున్నాడు.



సినిమా ధియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేసిన పరిస్థితులలో కొన్ని చోట్ల సినిమా షోలను కూడ క్యాన్సిల్ చేస్తున్నారు. ఎన్నికలు ఐపీల్ క్రికెట్ మ్యాచ్ లు ఫుల్ స్వింగ్ లో జనం ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులలో కనీసం అల్లరి నరేష్ అయినా తన సినిమాకు ప్రేక్షకులను రప్పించగలడా అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది.



ఈసినిమాను ఏదోవిధంగా హిట్ చేయాలి అన్న అభిప్రాయంతో ఉన్న నరేష్ తన మూవీ టైటిల్ కలిసి వచ్చే విధంగా ‘ప్లీజ్ అది ఒక్కటీ చేసిపెట్టండి’ అంటూ ప్రేక్షకులను తన సినిమాను చూడటానికి ఆహ్వానిస్తున్నాడు. సినిమాలను చూడటం చాల భారంగా ఫీల్ అవుతున్న ప్రేక్షకుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈమూవీ నిడివి కేవలం 2 గంటల 14 నిముషాలు ఉండే విధంగా రన్ టైమ్ ఫైనల్  చేసినట్లు తెలుస్తోంది.



మార్చి నెలాఖరు ప్రాంతంలో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన ‘టిల్లు స్క్వేర్’ నిడివి కూడ ఇలాగే 2 గంటల 15 నిముషాలకు కుదించి నేటితరం ప్రేక్షకులకు బోర్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీమ్ ఫాలో అవుతోంది అనుకోవాలి. సరైన ఎంటర్ టైనర్ మూవీ విడుదల అయి చాల రోజులు అయిన పరిస్థితులలో ఈ గ్యాప్ ను ఎంతవరకు తెలివిగా అల్లరి నరేష్ ఉపయోగించుకుంటాడో చూడాలి..  





మరింత సమాచారం తెలుసుకోండి: