తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి అంజలి 2014 వ సంవత్సరంలో గీతాంజలి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ ముఖ్య పాత్రలలో నటించగా ... రావు రమేష్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ హార్రర్ కామెడీ జోనర్ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసింది. 

ఇలా ఈ మూవీ ఆ సమయం లో సూపర్ సక్సెస్ కావడంతో దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అని మూవీ ని రూపొందించారు. ఇందులో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటించగా ... శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇ

లా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా "ఓ టి టి" ఎంట్రీ కి రెడీ అయింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను మే 8 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: