మనీషా కొయిరాలా.. తెలుగు ప్రేక్షకులకు ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్రిమినల్ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఒకే ఒక్కడు సినిమాలో తన అందం, అమాయకత్వంతో ప్రేక్షకులని కట్టి పడేసింది. ఈ చిత్రంలోని నెల్లూరి నెరజాణ.. పాట అప్పట్లో తెగ పాపురల్ అయ్యింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ అవకాశాలు రావడంతో.. అక్కడ స్టార్ హీరోయిన్గా రాణించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో నేపాల్కు చెందిన సామ్రాట్ దహల్ను పెళ్లి చేసుకుంది. కానీ వివాహం అయిన పెళ్లయిన ఆరునెలలకే తాను ఆ బంధంలో కొనసాగలేనని ఆమెకు అర్థం అయ్యింది. ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.
ఓ వైపు వివాహ బంధం వైఫల్యం కావడం.. మరోవైపు బిజీ సినిమా షెడ్యూల్స్.. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనై తాగుడుకు బానిసైంది మనీషా. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ బాధలు చాలదన్నట్లు 2012లో ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. మనీషా కొయిరాల అండాశయ క్యాన్సర్ బారిన పడింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న స్నేహితులు.. అలాంటి కష్ట సమయంలో అండగా ఉండాల్సింది పోయి తమకు సంబంధం లేదన్నట్లు మనీషాను వదిలి వెళ్లిపోయారట