గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గం గం గణేశా : ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
భజే భాయు వేగం : టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ హీరో గా రూపొందిన ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు కూడా ఆకరుగా నటించిన మూవీలతో మంచి విజయాలను అందుకుని ఉండడం , వీరు నటించిన ఈ ఈ మూడు మూవీ లప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.