శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా మనమే. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా కనిపించబోతోంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ సార్ చేస్తూ బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే నిర్వహించబోతున్నారట చిత్ర బృందం.

 అయితే ఆ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఎవరు రాబోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.  గత కొద్ది రోజులుగా ఈ ఈవెంట్ పిఠాపురంలో జరగబోతోంది అని.. దానికి ముఖ్యఅతిథిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ రాబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరూ మంచి స్నేహితులు. శర్వానంద్ పెళ్లికి కూడా రామ్ చరణ్ వెళ్లి సందడి చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ స్నేహంతోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్సినిమా యొక్క ఫ్రీ రిలీజ్

 ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ముఖ్యఅతిథిగా రావట్లేదు అని తెలుస్తోంది.  మాస్ మహారాజా రవితేజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా లేటెస్ట్ వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం చేయబోతుంది అని సమాచారం. అలా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈవెంట్ కి రాంచరణ్ గా వస్తాడా లేదా మాస్ మహారాజా రవితేజ అతిథిగా వస్తాడా అన్న విషయం తెలియాలి అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల  నడుమ విడుదలవుతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: