టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్ కి జోడి గా నటించింది. వషిం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. 

ఇకపోతే ఈ సినిమాని జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులను మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఓ రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అసెంబ్లీ నియోజ కవర్గం అయినటువంటి పిఠాపురం లో మనమే సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు , ఆ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా తీసుకురాబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆ అప్డేట్ ప్రకారం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో చేయడం లేదు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు లోని పార్క్ హయత్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: