పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చాలా రోజుల క్రితం ఓజి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ , పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఫుల్ స్పీడ్ గా జరిగింది. దానితో మేకర్స్ ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న సమయం లోనే ఆంధ్ర లో ఎలక్షన్ల హడా విడి ప్రారంభం కావడంతో పవన్ వాటి పై దృష్టి సారించాడు. దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఎన్ని రోజుల పాటు పవన్ ఎలక్షన్ల హడా విడిలో మునిగిపోయాడు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ తాజాగా వచ్చాయి. అందులో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు , ఆ పాత్ర నిడివి చాలా తక్కువ సమయం ఉన్న సినిమా కథ మొత్తాన్ని ఆ పాత్ర మలుపు తిప్పబోతున్నట్లు అందుకోసం ఇంత కీలకమైన పాత్రలో అద్భుతమైన క్రేజ్ ఉన్నతు వంటి నటుడిని తీసుకోవాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అమితా బచ్చన్ ని తీసుకోవాలి అని మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక వేళ అమితా బచ్చన్ కనుక ఈ సినిమాలో నటించను అని చెప్పినట్లు అయితే ఆ తర్వాత మమ్ముట్టి ని సంప్రదించాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు , వీరిద్దరిలో ఎవరో ఒకరిని కచ్చితంగా ఒప్పించి కీలకమైన పాత్రలో తీసుకోవాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: