టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు కొంత కాలం క్రితమే వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా కేవలం యావరేజ్ మూవీగా మిగిలిపోయింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్లో 30 వ మూవీగా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ ను "ఎస్ కే 30" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి రీతూ వర్మ ను హీరోయిన్ గా అనుకుంటున్నట్లు , అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈమెకు ఈ సినిమా యొక్క కథను , అందులోని తన పాత్రను వివరించగా ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరో గా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk