రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. బాహుబలి సినిమా తర్వాత సరైన విజయం లేని ప్రభాస్ కి సలార్ సినిమా సరి కొత్త జోష్ ను నింపింది. ఇక తాజాగా ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి అనే సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను ఫుల్ జోష్ లో ముందుకు నడిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ మరియు రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం కల్కి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు నటుడు , రాజకీయ నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే వీరిద్దరిని కలిసి మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలి అని కోరినట్లు , దానికి వీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , విరి వీలును చూసి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే వీరిద్దరూ కనుక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినట్లు అయితే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: