తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరోగా నటించాడు . ఈ మూవీ ని జూన్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను వేగవంతం గా చేస్తున్నారు . అలాగే ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను కూడా ఈ మూవీ బృందం వారు అమ్మి వేస్తున్నారు. 

అందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా తాజాగా విడుదల చేసింది . ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ హక్కులను ఈ చిత్ర బృందం మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి సంస్థకు అమ్మి వేసేంది . ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ బృందం వారు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేయగా ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది .

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను దక్కించుకున్న మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి గత కొంత కాలంగా సుధీర్ బాబు నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. మరి హరోం హర మూవీ తో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb