ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అప్పటివరకు మంచి వాళ్లే అన్నట్లుగా ప్రవర్తిస్తున్న ఎంతోమంది.. చివరికి సమయం సందర్భం చూసి వారిలోని నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మోసం చేస్తున్న ఘటనలు నేటి రోజుల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయ్. ఉద్యోగం వ్యాపారం చేసుకుని సమాజంలో గర్వంగా బ్రతకడం కంటే ఇక ఏదో ఒక మోసానికి పాల్పడి అందిన కాడికి దోచుకోవాలని ఆలోచన చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో రీతిలో అటు సాటి మనుషులను మోసం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు  కొంతమంది సైబర్ కేటుగాళ్లు ఏకంగా ఓటీటీల పేరుతో ఖాతాలు ఖాళీ చేస్తుంటే.. ఇంకొంతమంది అధిక డబ్బు ఆశ చూపి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలు కేవలం సామాన్యులకు మాత్రమే కాదు. సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు అన్నది అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్గా పిలుచుకునే ఒక నటి ఏకంగా కోట్ల రూపాయలు నష్టపోయింది. నష్టపోవడం కాదు ఒక వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయింది.



 హీరోయిన్ రీమిసేన్ ఏకంగా 4.14 కోట్ల రూపాయలు మోస పోయింది. అధిక వడ్డీకి ఆశపడి మూడేళ్ల క్రితం తన ఫ్రెండ్ రోనాక్ వ్యాస్ కు విడతలవారీగా ఆమె 4.14 కోట్ల రూపాయలు ఇచ్చింది. అయితే అవి వడ్డీతో కలిపి ఏకంగా 14 కోట్ల మీద అయ్యాయి. అయితే తిరిగి ఇచ్చే సమయానికి సదరు వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె ఇదే విషయంపై ఏడాదిన్నర క్రితం  పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఈ కేసు సిఐడి చేతికి వెళ్ళింది. కాగా రిమి సేన్ అటు మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు మూవీలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: