సినీ ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్టులు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యాయి అనే స్టేజ్ వరకు వచ్చే ఆగిపోతాయి. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళతాయి అన్న స్టేజికి వెళ్ళాక ఆగిపోయిన కాంబో మూవీస్ ఏవో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీలోను, వేణు దర్శకత్వంలోను ఓ మూవీ చేయాలి అని కమిట్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఈ రెండు సినిమాలు సెట్ అయ్యాయి కూడా అంతా అనుకున్నారు. కానీ నాని, సుజిత్ కాంబో మూవీకి భారీ బడ్జెట్ అవుతుంది అని నేపథ్యంతో క్యాన్సల్ అయినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా వేణు, నానికి కథను వినిపించగా ఆ కథ దసరా మూవీ స్టోరీ కి దగ్గరగా ఉండడంతో అలాంటి కథతో మళ్ళీ మూవీ చేస్తే వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా నాని క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా నాని రీసెంట్ గానే రెండు సినిమాలను క్యాన్సల్ చేశాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగినట్లు గానే అల్లు అర్జున్ కూడా కొన్ని సార్లు చెన్నై కి వెళ్లి మరి ప్రత్యేకంగా అట్లీ ని కలిశాడు. దానితో వీరి ప్రాజెక్టు ఓకే అయింది అని అంతా అనుకున్నారు. కానీ అట్లీ ఈ సినిమాకు భారీ రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయడంతో అంత వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థలో ఓ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. దానితో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతుంది అని అంత అనుకున్నారు. కానీ ఆ తర్వాత  అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యే ఛాన్స్ ఉన్నందున అంత వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఈ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: