![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/telugu-movies2d533d6a-91d1-4857-8e6e-d82c1bc392cb-415x250.jpg)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర మూవీ లో నాగార్జున అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ముంబైలో నాగార్జున , ధనుష్ పై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విశ్వంభర మరియు కుబేర మూవీలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.