పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ గా ఉంది.హాలీవుడ్‌ సినిమాని తలపించే రేంజ్ లో ఈ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్ రూపొందించాడు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ బాక్సాఫీస్ వద్దే కాకుండా విదేశాల్లో కూడా వసూళ్ల రికార్డ్‌ లు నమోదు అవ్వడం ఖాయం అనే నమ్మకం ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతుంది. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ పట్టణాలు ఇంకా నగరాల్లో కల్కి సినిమాను భారీ ఎత్తున స్క్రీనింగ్‌ చేసేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.


 ప్రస్తుతం పెద్ద పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో దీపికా పదుకునే ఇంకా అలాగే దిశా పటానీ లు హీరోయిన్స్ గా నటించారు.సీనియర్ హీరోలు అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటించారు. అలాగే నాని, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు గెస్ట్ రోల్‌ లో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ అందులో క్లారిటీ లేదు. ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి మేకర్స్ కి ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల విషయంలో కల్కి 2898 ఏడి మూవీ టీం ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ని సంప్రదించగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ అయితే 75 రూపాయలు, మల్టీ ప్లెక్స్ అయితే 125 రూపాయల మేర పెంచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ కల్కి టీంకి అనుమతి ఇచ్చింది.దీంతో మేకర్స్ ఇప్పుడు ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.కల్కి సినిమాకి ఖచ్చితంగా భారీ వసూళ్లు రావడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: