ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న మూమెంట్ రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కల్కి 2898 AD “ కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్స్ నటించారు.ఊహించని అంచనాలతో రిలీజ్ అయిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. ప్రభాస్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ రేంజ్ ఎలివేషన్స్ తో చూపించి  ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు..అలాగే సినిమాలో హీరోయిన్‌లుగా దీపికా పదుకోన్, దిశా పటాని ఎంతగానో అలరించారు. ఈ సినిమాలో దీపికాను కేవలం గ్లామర్ కోసం వాడకుండా కథలో భాగం చేసి తన అద్భుతమైన నటనకు స్కోప్ ఇచ్చారు. అలాగే దిశా పటాని సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.. 

ఇక  ఈ సినిమాలో  అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు..ప్రభాస్‌,అమితాబ్ మధ్య జరిగే యాక్షన్స్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి..నాగ అశ్విన్ ప్రభాస్, అమితాబ్ చూపించిన తీరు అద్భుతం అని ప్రేక్షకుల నుండి కామెంట్లు వినిపించాయి.ఫైట్ సీన్స్‌లో ఇద్దరికీ నాగ్ అశ్విన్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కమలహాసన్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా ఎండింగ్ లో కమల్ పాత్రతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ అని చెప్పకపోయినా కూడా కల్కి యూనివర్స్ ని ప్రకటించాడు. అంటే ఈ సినిమాను మరిన్ని పార్ట్స్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కల్కి యూనివర్స్ నుంచి రెండో పార్ట్ మరో మూడున్నర ఏళ్లలో రానున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: