రష్మిక మందన్న.. తెలుగులో ‘ఛలో’ మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

సౌత్ సినిమాలతో ఫిల్మ్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన నార్త్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రష్మిక మందన పుష్ప,గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది.నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ‘పుష్ప’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో అంద‌రికీ తెలిసిందే. అందం, అభిన‌యంతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, వ‌రుస‌గా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. కేవ‌లం సౌత్ లోనే కాకుండా ‘యానిమ‌ల్’ మూవీతో నార్త్ లోనూ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు త‌న అభిమానుల‌ను భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ట ఈ బ్యూటీ. బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా తో క‌లిసి ఓ హార్ర‌ర్ కామెడీ మూవీలో న‌టించేందుకు ర‌ష్మిక రెడీ అవుతోంద‌ట‌. ఈ సినిమాను ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ వంటి హార్ర‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత దినేష్ విజ‌న్ ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ఆదిత్య స‌త్పోద‌ర్ క‌థను రెడీ చేయ‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం ర‌ష్మిక‌ను ఓకే చేశార‌ట మేక‌ర్స్.ఆయుష్మాన్ ఖురానా తో తొలిసారి జ‌త‌కడుతున్న ర‌ష్మిక, మునుపెన్న‌డూ చూడ‌ని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్’ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ట.

మరింత సమాచారం తెలుసుకోండి: